బాలీవుడ్ నిర్మాత కరీమ్ మొరానీకి రెండోసారి నిర్వహించిన వైద్య పరీక్షల్లోనూ కరోనా(కోవిడ్-19) పాజిటివ్గా తేలింది. తొలుత కరీమ్ కుమార్తెలు జోవా, షాజాలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వారిద్దరు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక విదేశాల నుంచి వచ్చిన కూతురి ద్వారా కరీంకు కరోనా సోకినట్లు భావిస్తున్న తరుణంలో ముంబైలోని నానావతి ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో కరీం మాత్రం ఇంకా వైరస్ బారి నుంచి కోలుకోలేదని వైద్యులు వెల్లడించారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది.(ఆస్పత్రి నుంచి నిర్మాత కుమార్తెల డిశ్చార్జ్)
నిర్మాతకు రెండోసారీ కరోనా పాజిటివ్